పాక్ ఊపిరి పీల్చుకో.. భారత్ వస్తుంది..

     Written by : smtv Desk | Fri, Jan 26, 2018, 01:32 PM

పాక్ ఊపిరి పీల్చుకో.. భారత్ వస్తుంది..

జనవరి 26 : ఐసీసీ అండర్-19 లో భారత్ జట్టు హవా కొనసాగుతుంది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా జట్టు 131 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో భారత్ జట్టు దాయాది దేశమైన పాకిస్తాన్ తో ఈ నెల 30న సెమీఫైనల్ -2లో తలపడనుంది. తొలుత టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ పృథ్వి షా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ పృథ్వీ షా(40), శుభ్నమ్‌ గిల్‌(86), అభిషేక్‌ శర్మ(50) బ్యాటింగ్‌లో రాణించడంతో నిర్ణీత 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌ బౌలర్లు నాగర్‌ కోటి(3), శివమ్‌ మావి(2), అభిషేక్‌ వర్మ(2) రాణించడంతో ఆ జట్టు 42.1 ఓవర్లలో 134 పరుగులకే చాపచుట్టేసింది. ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ గా శుభ్నమ్‌ గిల్‌ నిలిచాడు. సెమీఫైనల్- 1లో ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ ఈ నెల 29న తలపడనున్నాయి.





Untitled Document
Advertisements