తిరువనంతపురం, జనవరి 29 : దగ్గుబాటి రానా.. విభిన్నమైన కథలతో, తనదైన శైలిలో టాలీవుడ్, బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నారు. రాజమౌళి దృశ్య కావ్యం 'బాహుబలి' సినిమాలో భల్లాల దేవుడు పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మలయాళంలో తొలి సారి అరంగేట్రం చేయబోతున్నారు.
ఆయన ట్రావెన్కోర్ను పాలించిన (1729-1758) రాజు మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తీయనున్న 'మార్తాండ వర్మ : ది కింగ్ ఆఫ్ ట్రాన్స్ కోర్' ఛిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. కె.మధు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
తాజాగా రానా తన చిత్ర టీంతో కలిసి త్రివేండ్రంలోని శ్రీ పత్నభ టెంపుల్ ని సందర్శించారు. ఈ సినిమా కోసం రానా రాజు గురించిన వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారని, అతని హవాభావాలు, జీవన శైలిపై అధ్యయనం చేస్తున్నారని చిత్ర కథ రచయిత రాబిన్ తిరుమల వెల్లడించారు. ప్రస్తుతం రానా ‘హాతీ మేరా సాథీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.