రైతు సమస్యలపై ఉత్తమ్ మొసలి కన్నీరు : హరీష్

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 05:34 PM

రైతు సమస్యలపై ఉత్తమ్ మొసలి కన్నీరు : హరీష్

హైదరాబాద్, జనవరి 29 : రైతుల సమస్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నేడు వనపర్తిలోని పామిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నెల రోజుల్లో పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేసి అర టీఎంసీ మేర నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయని వారు ఇప్పడు మాత్రం ఏం చేస్తారు.? నిజంగా రైతుల పట్ల అంత ప్రేమే ఉంటే ప్రాజెక్టులపై వేసిన కేసులను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.





Untitled Document
Advertisements