హైదరాబాద్, ఫిబ్రవరి 1 : రానున్న శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లు సాధిస్తే తానూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. గద్వాల్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరని ప్రజలకు సేవలందించే వారినే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మరో 20 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజలు టీఆర్ఎస్ నే విశ్వసిస్తున్నారన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్.. కాంగ్రెస్ గెలువలేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాలు విసిరారు.