సిని నిర్మాతగా మారిన స్టార్ క్రికెటర్..

     Written by : smtv Desk | Fri, Jan 27, 2023, 01:25 PM

సిని నిర్మాతగా మారిన స్టార్ క్రికెటర్..

మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన ఆటతో పాటు ఎంతో సంయమనంతో ప్రవర్తించే తన తీరుతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న అరుదైన ఆటగాడు ధోని. ఈ క్రీడాకారుడు క్రీడారంగంలోనే కాకుండా సిని రంగ ప్రవేశం కూడా చేయబోతున్నాడు. అవును ఇది నిజమే ధోని సిని నిర్మాతగా మారబోతున్నాడు. అది కూడా తమిళ సినిమా తీయనుండడం ఆసక్తికరం. హరీష్ కల్యాణ్, ఇవాన, నదియా, యోగిబాబు ఇందులో నటించనుండగా, రమేష్ తమిళమణి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై నేడు ప్రకటన వెలువడింది. కాకపోతే ధోనీ తన భార్య సాక్షి సింగ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (ఎల్ జీఎం) పేరును ఖరారు చేశారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ కింద తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీయనున్నారు. నిర్మాతగా ధోనీ భార్య సాక్షికి, దర్శకుడిగా రమేష్ తమిళమణికి ఈ సినిమా మొదటిది కావడం గమనార్హం. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ను గమనించొచ్చు. మరీ మన ధోని భాయ్ తీయబోయే సినిమా కూడా తనలాగే కూల్ గా ఉంటుందా లేదో తెలియాలి అంటే వేచి చూడాలి.
https://twitter.com/DhoniLtd/status/1618859048040013826?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1618859048040013826%7Ctwgr%5E9a6370473a15eace69ca8276a0e894f13f335573%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763151%2Fdhoni-entertainments-first-film-titled-lets-get-married-announced-to-feature-harish-kalyan-and-ivana





Untitled Document
Advertisements