ప్రమాదానికి గురైన తరువాత తొలిసారి ఆసుపత్రి గది బయట పంత్

     Written by : smtv Desk | Wed, Feb 08, 2023, 11:30 AM

ప్రమాదానికి గురైన తరువాత తొలిసారి ఆసుపత్రి గది బయట పంత్

స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30న జరిగిన యాక్సిడెంట్ లో రోడ్డు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే మొదట డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన అతను తర్వాత ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి
డాక్టర్స్ రెండు సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజా సమాచారం ఇచ్చాడు. బల్కనీలో కూర్చున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నానని తెలిపాడు.

‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఆసుపత్రి భవంతిలోనే పంత్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉంది.
పంత్ షేర్ చేసి ఫోటోస్ చూసిన అభిమానాలు ఆనందంగా ఫీల్ అవుతున్నారు.





Untitled Document
Advertisements