దేశంలో రోజువారీ 5 వేల మార్క్ దాటుతున్న కరోనా కేసులు

     Written by : smtv Desk | Thu, Apr 06, 2023, 11:37 AM

దేశంలో రోజువారీ 5 వేల మార్క్ దాటుతున్న కరోనా కేసులు

తగ్గింది అనుకున్న కరోనా మహమ్మారి మళ్ళి తన ప్రభావం చూపడం మొదలెట్టింది. మహమ్మారి విరుచుకుపడుతున్న క్రమంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,335 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుకంటే ఇది ఇరవై శాతం అధికం. గత ఏడాది సెప్టంబర్ తరువాత భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య 5 వేల మార్కు దాటడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 3.32గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది.

దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.06 శాతం కాగా రివవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో 2826 మంది కరోనా నుంచి బయటపడ్డట్ట కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,82,538.





Untitled Document
Advertisements