'పంతం'తో రానున్న గోపీచంద్..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 02:06 PM

'పంతం'తో రానున్న గోపీచంద్..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'సాహసం', 'లౌక్యం' వంటి చిత్రాలతో మంచి హిట్ సాధించిన గోపీచంద్ తనకు అచ్చొచ్చిన 'సున్నా' సెంటిమెంట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంకు ‘పంతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో గోపీచంద్ సరసన మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ గోపీచంద్ కు 25 వ చిత్రంకాగా మెహరీన్‌ పాఠశాల ఉపాధ్యాయురాలిగా కనిపించనున్నారు. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.





Untitled Document
Advertisements