ప్రస్తుత రోజులలో మనుషులు సుఖాలకు అలవాటుపడి పనిని సులభతరం చేసేందుకు ఎన్నో రకాల కొత్తరకం టెక్నాలజీని ఆవిష్కరిస్తు పోతున్నారు. అయితే మనిషి సృష్టిస్తున్న మెషిన్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఎన్ని అనారోగ్యాల భారీన పడుతున్నాడు. ఒకప్పుడు ఒళ్ళు వంచి కష్టపడి అన్నీ రకాల పనులు చేసుకుంటూ శారీరకంగా శ్రమించే వారు. అలా కష్టపడ్డప్పుడు బాగున్న ఆరోగ్యాలు ఇప్పుడు సుఖంగా తిని కూర్చుంటే రోగాల పలు అవుతున్నాయి. అయితే ఆయుర్వేద నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మనం తీసుకునే ఆహారంను బట్టి మన జీవితం మరియు మన ఆరోగ్యం ఉంటుంది. కరెంట్ కుక్కర్ లో తయారు చేసిన ఆహారం విషంగా మారుతుంది అంటున్నారు. అల్యూమీనియం పాత్రలో తయారు అయ్యే ఆహారం విషం గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరెంట్ కుక్కర్ లో అల్యూమీనియం బౌల్ ను ఉపయోగిస్తారు. ఆ బౌల్ అనేది పూర్తిగా బయటకు కనిపించకుండా లో లోపలే అన్నంను రెడీ చేస్తుంది. అలా చేయడం వల్ల అల్లూమీనియం లోని విష పదార్థలు ఆహారంలో చేరతాయి. .
అల్యూమీనియంను అత్యధికంగా వేడి చేసిన సమయంలో విషపు వాయువులు వెలువడుతాయి.
ఒక సారి కనుక ఆ ఆహారం తింటే పర్వాలేదు పది ఇరువై సార్లు తిన్నా కూడా ఎక్కువ ప్రయోజనం ఉండక పోవచ్చు. కాని అదే పనిగా ఏళ్లకు ఏళ్లు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఉన్న జీర్ణ వ్యవస్థను ఈ అల్యూమీనియంతో ఉండే ఆహార పదార్థలు చెడగొడుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా సమస్యలకు తలెత్తడంతో ముందు ముందు మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గుండెకు సంబంధించిన సమస్య మొదలుకుని పలు అనారోగ్య సమస్యలకు ఖచ్చితంగా కరెంట్ కుక్కర్ లో వండిన అన్నం అవుతుందని అంటున్నారు. కీళ్ల వాతం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాది లేని వారు ఈ కుక్కర్ అన్నం తినడం వల్ల వెంటనే కాకున్నా భవిష్యత్తులో ఖచ్చితంగా దాని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ సంబంధిత సమస్యలు మొదలుకుని అధిక బరువు ఇంకా కాలేయం సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి అంటూ నిపుణులు చెబుతున్నారు.