టీ20 మ్యాచ్ అప్డేట్స్.. విశాఖలో టీమిండియా-ఆసీస్ మ్యాచ్.. ప్రారంభమైన టికెట్ల అమ్మకం

     Written by : smtv Desk | Fri, Nov 17, 2023, 11:51 AM

టీ20 మ్యాచ్ అప్డేట్స్.. విశాఖలో టీమిండియా-ఆసీస్ మ్యాచ్.. ప్రారంభమైన టికెట్ల అమ్మకం

విశాఖలోని మధురవాడ స్టేడియంలో ఈ నెల 23నటీమిండియా, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఈ రోజు ఆఫ్ లైన్ విధానంలో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. నేడు ఉదయం 10 గంటల నుంచి టికెట్ల అమ్మకం మొదలు పెట్టారు.
ఈ మ్యాచ్ ను క్రీడాభిమానులు తిలకించేందుకుగాను మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు మధురవాడ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాక ఇండోర్ స్టేడియంలోనూ అమ్మకాలు జరుగుతున్నాయి. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500 ధరల శ్రేణిలో టికెట్ల విక్రయాలు చేపట్టారు.
వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా, ఆసీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు సిరీస్ జరగనుంది.





Untitled Document
Advertisements