పూర్తయిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.. ప్రధాని చేతుల మీదుగా ప్రత్యేక పూజలు

     Written by : smtv Desk | Mon, Jan 22, 2024, 12:57 PM

పూర్తయిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.. ప్రధాని చేతుల మీదుగా ప్రత్యేక పూజలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామమందిర కొరకు ఎదురుచూసిన భక్తుల కల సాకారం అయ్యింది. ఎందరో హిందువు సోదరుల పోరాటానికి ఫలితం దక్కింది. నేడు అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు, రాముడి ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈరోజు యావత్ దేశ రామ నామ స్మరణతో మారుమోగింది. జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్











Untitled Document
Advertisements