దేశవాళీ క్రికెట్ లో రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తనయుడు

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 08:38 AM

దేశవాళీ క్రికెట్ లో రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తనయుడు

ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలీవుడ్ సీనియర్ దర్శకుడు విధు వినోద్ చోప్రా ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన కుమారుడు అగ్ని చోప్రా భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో సెంచరీలతో పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. అగ్ని చోప్రాకు ఇదే మొదటి రంజీ సీజన్.

25 ఏళ్ల అగ్ని ఆడుతున్న తొలి రంజీ సీజన్ లో తొలి 4 మ్యాచ్ ల్లో 5 సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇలా తొలి 4 మ్యాచ్ ల్లో సెంచరీలు చేసిన ఆటగాడు ఇతడొక్కడే.

అగ్ని చోప్రా రంజీల్లో మిజోరం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో ఈ యువ ఆటగాడు సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మేఘాలయపై రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేయడం విశేషం.





Untitled Document
Advertisements