వరల్డ్ కప్ అండర్-19.. సెంచరీలతో అదరగొట్టిన భారత జట్టులోని ఆ ఇద్దరు.

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 09:02 PM

వరల్డ్ కప్  అండర్-19..  సెంచరీలతో అదరగొట్టిన భారత జట్టులోని ఆ ఇద్దరు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టు నేపాల్ తో తలపడుతోంది. బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది.

భారత్ ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ సెంచరీలతో అదరగొట్టారు. సచిన్ దాస్ 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 116 పరుగులు చేయగా.. ఉదయ్ సహారన్ 107 బంతుల్లో 9 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేశారు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ ఝా 3, ఆకాశ్ చంద్ 1 వికెట్ తీశారు.





Untitled Document
Advertisements