ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టు నేపాల్ తో తలపడుతోంది. బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది.
భారత్ ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ సెంచరీలతో అదరగొట్టారు. సచిన్ దాస్ 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 116 పరుగులు చేయగా.. ఉదయ్ సహారన్ 107 బంతుల్లో 9 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేశారు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ ఝా 3, ఆకాశ్ చంద్ 1 వికెట్ తీశారు.