కెనడా మీడియా సంచలన కథనం.. భారత్‌తో ముప్పు పొంచి ఉంది

     Written by : smtv Desk | Sat, Feb 03, 2024, 10:10 AM

కెనడా మీడియా సంచలన కథనం..  భారత్‌తో ముప్పు పొంచి ఉంది

చైనాతో చేతులు కలిపిన కెనడా భరత్ మీద కక్ష్యపూరితమైన వాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అనవసరంగా భారత్ పై రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువుతుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి కెనడా అత్యున్నత విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నట్టు తన నివేదికలో పేర్కొంది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరించింది. గతేడాది విడుదలైన ఈ నివేదిక వివరాలను స్థానిక మీడియా తొలిసారిగా బహిర్గతం చేసింది. భారత్‌తో పాటూ చైనా, రష్యాపై కూడా కెనడా నిఘా సంస్థ ఇవే తరహా ఆరోపణలు చేసింది. కెనడా నిఘా నివేదికలో భారత్‌ పేరును నేరుగా ప్రస్తావించడం కూడా ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామం కలకలం రేపుతోంది.

కెనడా రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భారత్ జోక్యాన్ని అడ్డుకోకబోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నివేదిక ఆధారంగా కెనడా ప్రధాని జస్టిన్ట్ ట్రూడో లోతైన దర్యాప్తునకు ఆదేశించారు.

మరోవైపు, చైనా జోక్యంపై నిఘా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. చైనాను అతిపెద్ద విదేశీ ముప్పుగా వర్ణించాయి. కెనడా రాజకీయాల్లో చైనా కార్యకలాపాల విస్తృతి, వినియోగిస్తున్న వనరుల దృష్ట్యా కమ్యునిస్టు దేశం తీరు ఆందోళనకరమని అభిప్రాయపడ్డాయి. కెనడాలోని అన్ని రంగాలు, అన్ని స్థాయిల్లో చైనా జోక్యం పెరిగిపోయిందని పేర్కొన్నాయి. ఈ నిఘా నివేదికలో భారత్‌తో పాటూ చైనా పేరును కూడా నేరుగా ప్రస్తావించాయి. విదేశీ జోక్యంపై నివేదిక పేరిట ఈ రిపోర్టును గతేడాది ఫిబ్రవరిలో కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమర్పించింది.





Untitled Document
Advertisements