బడ్జెట్ పై కేసీఆర్, కేటీఆర్ స్పందించట్లేదు : శ్రవణ్ కుమార్

     Written by : smtv Desk | Sun, Feb 11, 2018, 03:21 PM

బడ్జెట్ పై కేసీఆర్, కేటీఆర్ స్పందించట్లేదు : శ్రవణ్ కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 11 ‌: కేంద్రం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో రెండు తెలుగు రాస్త్రాలకు మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించడంలేదని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అక్కడి ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తుంటే... తెలంగాణ నుంచి ఎన్నికైన తెరాస ఎంపీలు మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్‌ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements