జొహానెస్బర్గ్, ఫిబ్రవరి 12 : ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరిగిన నాలుగో వన్డేలో సఫారీ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో సౌతాఫ్రికా జట్టు 1-3 తో సిరీస్ లో ఆశలును సజీవంగా ఉంచుకుంది. కాగా నాలుగో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రోటిస్ జట్టుపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతాన్ని, కెప్టెన్ మార్క్రమ్ ఫీజులో 20 శాతాన్ని జరిమానాగా విధించాడు. ఇరుజట్ల మధ్య ఐదో వన్డే పోర్ట్ ఎలిజిబెత్ లో జరగనుంది.