ముస్తాబవుతున్న వీరేశ్వరస్వామి ఆలయం..

     Written by : smtv Desk | Mon, Feb 12, 2018, 04:08 PM

ముస్తాబవుతున్న  వీరేశ్వరస్వామి ఆలయం..

పోలవరం, ఫిబ్రవరి 12 : జిల్లాలో పోలవరం మండలం పట్టిసీమలో అఖండ గోదావరి నదీ తీరంలో స్వయంభువుడైన వీరేశ్వరస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలుకు ముస్తాబువుతుంది. సోమవారం అర్థరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున ఒంటి గంటకు తొలిపూజ చేస్తారు. భక్తులను తరలించేందుకు మొత్తం 15 లాంచీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడురోజులు కొనసాగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.





Untitled Document
Advertisements