అతని స్థానంలో రోహిత్ నే కెప్టెన్ గా ఎందుకు నియమించారో వివరించిన గంగూలీ

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 08:55 AM

అతని స్థానంలో రోహిత్ నే కెప్టెన్ గా ఎందుకు నియమించారో వివరించిన గంగూలీ

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ధోని తరువాత టీమిండియా కెప్టెన్సీ భాద్యతలు తీసుకుని సమర్థవంతంగా నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా పగ్గాలు చేపట్టాడు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని ప్రచారం జరిగింది. దీనిపై గంగూలీ గతంలో ఓసారి స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరిందని గంగూలీ అప్పట్లోనే వివరణ ఇచ్చారు.

ఇదే అంశం నేపథ్యంలో గంగూలీ మరోసారి స్పందించారు. కోహ్లీ స్థానంలో రోహిత్ నే ఎందుకు కెప్టెన్ గా నియమించారో వెల్లడించారు.

"రోహిత్ శర్మలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు గుర్తించాను. నా హయాంలోనే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అతడు జట్టును నడిపిస్తున్న తీరు పట్ల నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. అతడిని నేను టీమిండియా కెప్టెన్ ను చేయడానికి గల కారణం అతడిలోని ప్రతిభే. రోహిత్ శర్మ ఇటీవలి వరల్డ్ కప్ లో జట్టును ఎలా నడిపించాడో అందరూ చూశారు. భారత్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓడినప్పటికీ టీమిండియానే ఆ టోర్నీలో అత్యుత్తమ జట్టు అని నమ్ముతాను. మరలాంటప్పుడు రోహిత్ శర్మ మంచి కెప్టెనే కదా. అతడు సాధించిన ఐపీఎల్ ట్రోఫీలే ఆ విషయం చెబుతాయి" అని గంగూలీ వివరించారు. మరోసారి రోహిత్ పై గంగూలీ చేసిన ఈ వాఖ్యలు రోహిత్ పై ఆయనకు ఉన్న మక్కువని తెలియజేస్తున్నాయి.





Untitled Document
Advertisements