అతిలోక సుందరిగా పేరు పొందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా వరుస సినిమాలను చేస్తుంది . ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది.
మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ సినిమా చేస్తుంది. ఇటీవలే ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అందులో జాన్వీ పాల్గొనడం జరిగింది. తెలుగు లో రెండు సినిమాల్లో నటించడంతో పాటు మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి .
ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ మళ్లీ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ లో అడుగు పెడతామా అంటూ ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. దేవరలో మళ్లీ తంగ పాత్ర చిత్రీకరణ కోసం ఇక ఏమాత్రం వేచి ఉండలేక పోతున్నాను అంటూ తన ఇన్ స్టాలో పేర్కొంది. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ చేస్తున్న దేవర సినిమా అక్టోబర్ లో విడుదల అవ్వబోతుంది. దేవర రెండు పార్ట్ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ అక్టోబర్ లో విడుదల అవ్వనుండగా, రెండో పార్ట్ 2025 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ ను అందమైన పల్లెటూరు అమ్మాయిగా చూడబోతున్నాం. హిందీలో ఇప్పటి వరకు దక్కని కమర్షియల్ హిట్ కూడా తెలుగు సినిమాలతో దక్కించుకుంటాను అనే నమ్మకంతో జాన్వీ కపూర్ కనిపిస్తుంది. ఇప్పుడు చేసే సినిమాలలో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి ప్రేక్షకులను మేపించే విధం ఉన్నాయా అనే విషయమ తెలియడానికి ఇంకా కొన్ని రోజులు ఆగవలసిన పరిస్థితి ఉంది .