త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..

     Written by : smtv Desk | Sun, Feb 18, 2018, 11:37 AM

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..

అగర్తల, ఫిబ్రవరి 18 : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. 25 ఏళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న సీపీఎం కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మద్య పోరు హోరాహోరిగా సాగడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 60 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 59 స్థానాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. చరిలాం స్థానంలో సీపీఎం అభ్యర్థి మృతితో పోలింగ్‌ మార్చి 12కు వాయిదాపడిన విషయం తెలిసిందే.

పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రత నిమిత్తం 300 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. మార్చి 3 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.





Untitled Document
Advertisements