నిరీక్షణకు తెర పడింది..

     Written by : smtv Desk | Tue, Feb 27, 2018, 02:51 PM

నిరీక్షణకు తెర పడింది..

దుబాయ్, ఫిబ్రవరి 27 : శ్రీదేవి మృతి పట్ల వస్తున్న వదంతులకు తెర పడింది. ఆమె మృతి పట్ల అనుమానాలున్నాయంటూ ప్రాసిక్యూషన్ అధికారులు ఆమె భౌతికకాయానికి రీపోస్టుమార్టం నిర్వహించాలన్నారు. అనంతరం మరో కోణంలో విచారణ చేపట్టి వారి కుటుంబ సభ్యులను విచారించారు. ఇప్పుడు అనుమానాలన్ని పటాపంచలై ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖను ఇచ్చి ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పడు శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించడమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లో ముంబైకి చేరుకునే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements