దుబాయ్, మార్చి 13 : ఐసీసీ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో సఫారీ పేసర్ కగిసో రబడా మళ్లీ ప్రధమ స్థానంను ఆక్రమించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఏకంగా 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రబడా 902 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు.
భారత బౌలింగ్ విభాగంలో రవింద్ర జడేజా మూడో స్థానంలో, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పు జరగలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ సారథి స్టీవ్ స్మిత్ (943) అగ్రస్థానంలో ఉండగా, పరుగుల వీరుడు విరాట్ కోహ్లి ( 912) తో రెండో స్థానంలో ఉన్నాడు.