వాషింగ్టన్, మార్చి 21 : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. పాక్లాండ్ పాఠశాలలో పూర్వ విద్యార్థి కాల్పులు జరిపి 17 మందిని హతమార్చిన ఘటన మరవకముందే, మేరీల్యాండ్లో అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. మేరీల్యాండ్లోని గ్రేట్ మిల్స్ హైస్కూల్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కాల్పులలో జరిగినట్టు పాఠశాల విద్యార్థి తెలిపారు. దుండగుడు ఒక బాలిక, ఒక బాలునిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదని అధికారులు వెల్లడించారు.
సెయింట్ మేరీస్ కౌంటీ పబ్లిక్ స్కూల్ కాల్పులకు సంబంధించిన విషయాన్ని తన వెబ్సైట్లో పెట్టి ఆ పాఠశాలతో పాటు దగ్గర్లోని పాఠశాలలను మూసివేశారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిసర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించి అప్రమత్తం చేశారు. పాఠశాలలోని ప్రతి తరగతిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.