సుష్మాకు కాంగ్రెస్‌ షాక్..

     Written by : smtv Desk | Fri, Mar 23, 2018, 11:28 AM

సుష్మాకు కాంగ్రెస్‌ షాక్..

న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ షాక్ ఇచ్చింది. సుష్మాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోని ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇరాక్ ‘ఐసిస్‌ చేతిలో బంధీలైన 39 మంది భారతీయ విషయంలో సుష్మా పార్లమెంట్‌ను, వారి బంధువులను మోసం చేశారు. ఇంతకాలం వారు బతికే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ కుటుంబ సభ్యులను పక్కదారి పట్టించారు. అందుకే ఈ నోటీసులు అని అంబికా సోని తెలిపారు. రాజ్యసభలో ఈ తీర్మాన నోటీసులు ప్రవేశపెట్టనున్నట్లు అంబికా వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, గులాం నబీ ఆజాద్‌లు విదేశాంగ శాఖపై మండిపడ్డారు.







Untitled Document
Advertisements