తిరుమల శ్రీవారి బూంది పోటులో అగ్నిప్రమాదం

     Written by : smtv Desk | Wed, Mar 28, 2018, 05:36 PM

తిరుమల శ్రీవారి బూంది పోటులో అగ్నిప్రమాదం

తిరుపతి, మార్చి 28:తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల వున్న బూందీ పోటులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో వేడి ఎక్కువగా ఉండటంతో మంటలు చెలరేగినట్టు సమాచారం. మంటలు విపరీతంగా ఎగిసిపడుటుండంతో ఆలయ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదని, భక్తులు కూడా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆలయ యాజమాన్యం పేర్కొంది.





Untitled Document
Advertisements