హైదరాబాద్, ఏప్రిల్ 20 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్ ను దూషించమంటూ నటి శ్ర్రీరెడ్డిని రెచ్చగొడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదని ఆయన శిష్యుడు, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శించడం తన తప్పే. ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించండి అంటూ వర్మ పోస్ట్ చేశారు.
ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ స్పందిస్తూ.. "నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను తప్పు చేశాను. నేను ఇప్పటికే క్షమాపణ వేడుకున్నాను" అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. "నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తా" అంటూ పూరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.