హైదరాబాద్, ఏప్రిల్ 21 : ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం" విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. చెన్నైలోను, ఓవర్సీస్ లోనూ.. ఈ సినిమా తొలిరోజున భారీ వసూళ్లను రాబట్టింది.
సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" సినిమా రికార్డును "భరత్" బద్దలు కొట్టాడు. తొలి రోజున చెన్నైలో 'రంగస్థలం' 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి మొదటిస్థానంలో నిలిచింది. అయితే 'భరత్ అనే నేను' తొలిరోజు చెన్నైలో 27 లక్షలకి పైగా గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. కాగా కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.