హైదరాబాద్, ఏప్రిల్ 21 : వేసవిలో సినిమా విడుదల కార్యక్రమాలు జోరందుకున్నాయి. సినిమా విడుదల తేదీలు ఆ సినిమాలు వచ్చే వరకు తెలియట్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న 'మిడిల్ క్లాసు' హీరోయిన్ సాయిపల్లవి తాజాగా "కణం" చిత్రంలో నటించింది. నాగశౌర్య.. సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
ఇందులో సాయి పల్లవి తొలిసారి నాలుగేళ్ల కూతురికి తల్లిగా నటించింది. అయితే ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తొలుత ఈ సినిమాను మార్చి 3న విడుదల చేస్తామని ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఈ నెల 27 న విడుదల కానుంది.