దేశ సంపన్నుల జాబితాలో మరోసారి చోటు దక్కించుకున్న అదానీ

     Written by : smtv Desk | Fri, Jan 05, 2024, 12:02 PM

దేశ సంపన్నుల జాబితాలో మరోసారి చోటు దక్కించుకున్న అదానీ

భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక పేర్కొంది.
మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.





Untitled Document
Advertisements