నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2024 వ సంవత్సరపు బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు ముందు ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 250 పాయింట్ల లాభంతో 72 వేల మార్కు వద్ద ఉంది. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 21 వేల 780 మార్కు వద్ద కదలాడుతోంది.