లక్షద్వీప్ సహా దేశవ్యాప్తంగా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తాం..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 12:33 PM

లక్షద్వీప్ సహా దేశవ్యాప్తంగా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తాం..

2024 కేంద్ర ఆర్ధిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలసీతారామన్ సభలో ప్రసంగిస్తూ గడిచిన పదేళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ.. రాబోయే రోజులలో అభివృద్దే లక్ష్యంగా పని చేసేందుకు సిద్దంగా ఉన్నాము అని పేర్కొన్నారు. సభలో ప్రసంగిస్తున్న నిర్మలమ్మ దేశ పర్యాటక రంగం గురించి మాట్లాడుతూ లక్షద్వీప్ సహా దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని, స్పిరిచ్యువల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం మౌలిక వసతులు కల్పించడం కోసం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడింతలు పెరిగాయి. వసూలైన పన్నులను దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements