కేంద్ర ఆర్ధిక బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం నిర్మలమ్మ పలు రంగాలకు వారాల జల్లులు కురిపించారు. ఈ క్రమంలో రైల్వే మారయి రోడ్డు రవాణాకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
రైల్వేల్లో కొత్తగా పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, ఎనర్జీ, మినరల్ అండ్ సిమెంట్ కారిడార్ను ఏర్పాటు చేస్తాం. 40 వేల మామూలు రైలు బోగీలను వందే భారత్ స్టాండర్డ్కు అప్గ్రేడ్ చేస్తామన్నారు . కొత్తగా రోడ్డు-రైలు కారిడార్లను అందుబాటులోకి తెస్తున్నాము అన్నారు. విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్యను పెంచుతామన్నారు. ప్రజా రవాణా కోసం ఈ-బస్సుల వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు.