తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా క్వాలిఫయర్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేతో సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు.
వచ్చే జూన్ 6వ తేదీన దేశంలో నిర్వహించాల్సిన భారత్-కువైట్ జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్కు ఆతిథ్యమించ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపుతున్నాయని కల్యాణ్ సింగ్ తెలిపారు. కాబట్టి, ఈ విషయంలో తెలంగాణ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ఆ ఫిఫా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యత మొత్తం తెలంగాణ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.