ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఊరట కల్పిస్తూ ఎస్బీఐ కీలక నిర్ణయం..

     Written by : smtv Desk | Thu, Feb 22, 2024, 07:50 AM

ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఊరట కల్పిస్తూ ఎస్బీఐ కీలక నిర్ణయం..

బ్యాంకింగ్ పరిక్షల కొరకు సిద్దం అవుతున్న అభ్యర్థుల కొరకు ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే రోజు ఉంటాయని పరీక్షలు రాసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో వారికి ఊరటనిచ్చేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ పరీక్షను మరో రోజు రాసేందుకు అనుమతించింది. మునుపటి షెడ్యూల్స్ ప్రకారం, ఏపీ గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) మెయిన్స్ పరీక్షలు ఈ నెల 25న ఉన్న విషయం తెలిసిందే. దీంతో, ఏపీపీఎస్సీ పరీక్ష తేదీ మార్చాలంటూ ఎస్బీఐకి లేఖ రాసింది.

ఈ లేఖపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 25న గ్రూప్ - 2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. పరీక్ష తేదీ మార్పు కోరుతున్న వారు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు https://ibpsonline.ibps.in/sbijaoct23/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అభ్యర్థులకు కాస్త వెసలుబాటు లభించింది.





Untitled Document
Advertisements