స్టాక్ మార్కెట్లు ఎప్పుడు లాభాలు తెచ్చిపెడతాయో, ఎప్పుడు పూర్తిగా పతనం అవుతాయో ఊహించడం కష్టం. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుని, నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 73,668కి చేరుకుంది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 22,336 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.30%), టీసీఎస్ (1.69%), మారుతి (0.92%), ఇన్ఫోసిస్ (0.80%), రిలయన్స్ (0.65%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.82%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.47%), ఐటీసీ (-1.26%), టాటా మోటార్స్ (-1.11%), నెస్లే ఇండియా (-0.89%).
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.78గా ఉంది.