కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత టాలీవుడ్ లో తన మొదటి సినిమా అయినా ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు ఎటో వెళ్ళిపోయింది మనసు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.అలాంటి ఈ అమ్మడు ఎప్పుడు షూటింగ్ లో బిజీగా ఉంటుంది . కానీ ఈ మధ్య కాలంలో తన హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం వలన కాస్త దూరంగా ఉంటుంది అయితే ఒక విషయమ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఏంటి అంటే షూటింగ్ సెట్ లో హీరోయిన్ సమంత కుప్పకూలిందా , మయోసైటిస్ కారణంగా ఉన్న పళంగానే స్పృహ కోల్పోయిందా? అంటే అవుననే విషయం ఆస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్ కాస్ట్ లో అమ్మడు సంచలన నిజాలు బయట పెట్టింది. అవేంటో ఆమె మాటల్లోనే `మయోసైటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నాను. అయినా మానసికంగా ధృఢంగా ఉంటే దేనినైనా జయించొచ్చు. ఈ సమస్యలో బాధపడుతోన్న నాకు `సీటాడెల్` షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించింది.
అప్పటికే శారీరకంగా బలహీనంగా ఉన్నాను. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్నీ తెలిసి కూడా సైన్ చేసాను. ఓరోజు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో నాలో శక్తి పూర్తిగా నశించింది. కళ్లు మూతలు పడుతున్నాయి. చివరికి బాగా అలసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది. దీంతో సెట్లో అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను. ఇంతవరకూ అంత అనారోగ్యం ఎప్పుడూ అనిపించలేదు. ఈసిరీస్ కోసం ఎంత కష్టపడి పనిచేసానో నాకే తెలుసు. అందుకే నా కెరీర్ లో `సీటాడెల్` ఎప్పటికీ ప్రత్యేకమైనది చెబుతాను. సిరీస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు తప్పక ఎదురవుతాయి. అందుకు అందరూ సిద్దంగా ఉండాల్సిందే. ఓర్పుతో ముందుకెళ్తే కెరీర్ ఎంతో అందంగా ఉంటుందని తెలిపింది. నిజమే సమంత -నాగచైతన్య విడాకుల తర్వాత వ్యక్తిగతంగా తానెంత కృంగిపోయిందో తెలిసిందే. ఆ ఫేజ్ ని దాటి రావడం కోసం కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయింది. నటిగా అదే సమయంలో వరుసగా అవకాశాలు అందుకుంది. అప్పుడే మయోసైటిస్ బారిన పడటం దాన్ని నుంచి కోలుకోవడం జరిగింది కానీ మళ్లి ఇప్పుడు ఈ సమస్య వల్ల తన కెరీర్కు ఎలాంటి ఆపద వస్తుందో తెలియడం లేదు .