సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన జాన్వీ ప్రేమాయణం !

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 03:41 PM

 సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన జాన్వీ ప్రేమాయణం !

అతిలోక సుంద‌రి అయినా శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కపూర్ ప్రేమ లో పడిన విషయమ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . శిఖర్ పహారియాతో జాన్వీ రిలేష‌న్ షిప్ చాలా కాలంగా బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ జంట ప‌లుమార్లు విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లారు. రెగ్యుల‌ర్ గా ఈవెంట్ల‌లో క‌లిసే క‌నిపిస్తున్నారు. అంతేకాదు జాన్వీ అత‌డితో శృంగార సంబంధంలో ఉందని పాపా బోనీక‌పూర్ స్వ‌యంగా ధృవీకరించారు.

శిఖ‌ర్ పై తన అభిమానాన్ని వ్యక్తపరచడానికి జాన్వీ ఎప్పుడూ సిగ్గుపడదు. ఇటీవల త‌న‌ తండ్రి, సినీ నిర్మాత బోనీ కపూర్ త‌న కుమార్తె ప్రేమాయ‌ణం గురించి ఓపెన‌వ్వ‌డంతో అది ఇండ‌స్ట్రీ వ‌ర్గా లతో స‌హా ప్ర‌జ‌ల్లో కూడా చ‌ర్చ‌గా మారింది. ఇంత‌లోనే మ‌రో కొత్త ప‌రిణామం జాన్వీ కపూర్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

బుచ్చిబాబు ఫిక్స్‌ చూస్తుంటే జాన్వీ ఇప్పుడు బోయ్ ఫ్రెండ్ శిఖ‌ర్‌ని దూరం పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. నిన్న‌టిరోజున‌ త‌న బోయ్ ఫ్రెండ్ పుట్టిన‌రోజు అయినా కానీ సోష‌ల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌నేలేదు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి . జాన్వీ విష్ చేయ‌కుండా దాటవేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో జాన్వీ అత‌డిని దూరం పెట్టిందా? బోనీపై కోపం వ‌చ్చిందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శిఖర్ ఏప్రిల్ 3న తన పుట్టినరోజును జరుపుకున్నాడు.

మరోవైపు గత నెలలో జాన్వీ పుట్టినరోజు సందర్భంగా శిఖర్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో జాన్వీతో జంట‌గా క‌లిసి ఉన్న రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు. ఇందులో వారిద్దరూ ఈఫిల్ టవర్ ముందు నిలబడి రొమాంటిక్ ఫోజ్ ఇచ్చారు. శిఖర్ చేయి జాన్వీ భుజం చుట్టూ, ఆమె చేయి అతని నడుము చుట్టూ ఉంది. ఈ ఫోటోకి శిఖర్ రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి 'హ్యాపీ బర్త్‌డే' అని రాసాడు. ఇంతలో శిఖర్ తమ్ముడు వీర్ పహారియా, వారి చిన్ననాటి నుండి క‌లిసి ఉన్న‌ ఫోటోను షేర్ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపారు. వీర్ కేక్ - కిస్ ఎమోజితో పాటు 'హ్యాపీ బర్త్‌డే' అని రాశాడు.

బోనీ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన మరో ప్రకటన సోషల్ మీడియాలో దావానలంలా మారింది. ''అత‌డు(శిఖ‌ర్) ఎప్పటికీ మాజీ కాలేడని నేను నమ్ముతున్నాను. అతడు మా చుట్టూ ఉంటాడు. నా కోసమో, జాన్వీ కోసమో, అర్జున్ కోసమో ఏ వ్యక్తి అయినా మీ కోసం ఏ హోదాలో ఉన్నా, అతడు అందరితో స్నేహంగా ఉంటాడు. అందువల్ల మా సెటప్‌లో అతడిలాంటి వ్యక్తిని కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను'' అని అన్నారు. జాన్వీతో శిఖ‌ర్ ప‌హారియా స్నేహానికి బోనీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. శిఖర్ పహారియా రాజకీయ నాయకుడు,ఈయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు . శిఖర్ - జాన్వి ఇంతకుముందు ఘాడ‌మైన ప్రేమ‌లో ఉన్నారు. కానీ తరువాత విడిపోయారు. గత ఏడాది వీరిద్దరూ మ‌ళ్లీ జతకట్టినట్లు సమాచారం. వారు తరచుగా కలిసి కనిపిస్తారు. చివరకి వీరిద్దరి ప్రేమను బోని కపూర్ ఒప్పుకున్నట్లా లేదా అనే విషయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి .






Untitled Document
Advertisements