అర‌గంట పాటు ఒంటికాలిపైనే నిలబడిన జయప్రద

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 03:38 PM

అర‌గంట పాటు ఒంటికాలిపైనే నిలబడిన జయప్రద

అలనాటి నటులలో జయప్రదకు ఉన్నటువంటి స్థానం చెప్పలేనిది . త‌న‌దైన అందం, అభిన‌యం తో పాటు నృత్యక‌ళ‌తో , ప్రేక్షకుల హృద‌యాల్లో శాశ్వ‌తంగా నిలిచి పోయినది . చిన్ననాటి నుండి తనకు కళ పైన ఉన్న అభిమానంతో 14 సంవత్సరాల వయస్సులో బాల‌ నటిగా వృత్తిని ప్రారంభించింది. మొదటగా దర్శకుడు కె బాలచందర్ తెర‌కెక్కించిన 'అంతులేని కథ' చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో
ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. కె. విశ్వనాథ్ తెర‌కెక్కించిన క‌ళాత్మ‌క చిత్రం 'సిరి సిరి మువ్వ' త‌న‌లోని అసాధారణమైన నృత్య సామర్ధ్యాలను ఆవిష్క‌రించింది. ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా జ‌య‌ప్ర‌ద న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లికారు. భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం 'సీతా కళ్యాణం'లో సీత అనే టైటిల్ పాత్రను పోషించి త‌న‌లోని బహుముఖ ప్రజ్ఞను ఆవిష్క‌రించింది. 'సర్గమ్‌'లో రిషి కపూర్ స‌ర‌స‌న‌ హిందీ సినిమా రంగ ప్రవేశం చేసింది.

దూరదర్శన్ కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో జయప్రద తనకు ఎదురైన అత్యంత భయంకరమైన షూటింగ్ అనుభవాన్ని వెల్లడించింది. అది 1981లో కె బప్పయ్య దర్శకత్వం వహించిన 'అగ్ని పూలు' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగింది. అదే పేరుతో ఉన్న యద్దనపూడి సులోచనా రాణి నవల నుండి స్వీకరించిన క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. వి శాంతారామ్ 'జల్ బిన్ మచ్లీ నృత్య బిన్ బిజిలీ' నుండి కూడా ప్రేరణ పొందింది. ఈ సినిమాలోని ఓ పాటలో పాములా (స్నేక్) డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కె బప్పయ్య ఆమెను చూసి అస‌లు నీకు నృత్యం చేయడం వచ్చా అని కోప‌గించుకున్నారు. అప్పుడు జయప్రద చాల భాధ పడింది ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ త‌ర్వాత‌ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌తో పలు డ్యాన్స్ రిహార్సల్స్ జరిగాయి. ఆ సందర్భంలో జయప్రద 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దాని కారణంగా ఆమె రిహార్సల్స్‌కు ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. కొరియోగ్రాఫర్ త‌న‌పై పిచ్చి కోపంగా ఉన్నాడు. అంతే కోపముతో ఆలస్యానికి శిక్షగా అరగంట పాటు ఒంటికాలిపై నిలబెట్టాడు. జ‌య‌ప్ర‌ద‌ ఏడవడం ప్రారంభించ‌గా, చివరికి కొరియోగ్రాఫర్ నిజంగానే ఆమె అనారోగ్యంతో ఉందని గ్రహించార‌ట‌. కానీ ఇది వ‌ర్క‌వుటైంది. ఎందుకంటే రోజు ముగిసేప్ప‌టికి సినిమా బాగా వచ్చింది. ప్రజలు నన్ను ప్రశంసించారు. అని జ‌య‌ప్ర‌ద‌ ఇంటర్వ్యూలో చెప్పింది. జయప్రద హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాలతో పాటు అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించింది. చివరిసారిగా మలయాళ చిత్రం రామచంద్ర బాస్ & కోలో కనిపించింది. ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.ప్రస్తతం జ‌య‌ప్ర‌ద రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయాల కారణంగా త‌న‌ను కొన్ని కోర్టు వివాదాలు చుట్టు ముట్టిన సంగ‌తి అందరికి తెలిసిందే.దీనిని బట్టి ఏ హీరోయిన్ అయినా మంచి పేరు తెచ్చుకోవడానికి చాల కష్టపడవలసింది ఉంటుంది అని ఈమె జీవితములో జరిగిన సంఘటన వలన తెలుస్తుంది .





Untitled Document
Advertisements