పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో యానిమల్ సినిమా విషయాలు పంచుకున్న రష్మిక

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 04:59 PM

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో యానిమల్ సినిమా విషయాలు పంచుకున్న రష్మిక

రష్మిక మందన్న కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆ తర్వాత చలో సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయినది. అయితే బాలీవుడ్ లో కూడా నటించిన ఈ అమ్మడు . బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ లో నటించింది . ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గీతాంజలి పాత్రను నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోషించిన విషయం తెల్సిందే. అయితే యానిమల్‌ సినిమాతో బాలీవుడ్‌ లో మొదటి విజయాన్ని రష్మిక సొంతం చేసుకుంది. గీతాంజలి పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే పాత్రకు తగ్గట్టుగా రష్మిక నటించడంలో విఫలం అయ్యింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె నటన పై ప్రశంసలు కురిపించారు.

నేడు రష్మిక పుట్టిన రోజు ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంది. కర్వాచౌత్‌ సీన్ సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఆ సన్నివేశం లో రణబీర్ తో కలిసి నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఒక్క సన్నివేశంలోనే అనేక ఎక్స్‌ప్రెషన్స్ ను చూపించాల్సి ఉంటుంది. అందుకే ఆ సన్నివేశం ను ఛాలెంజ్ గా తీసుకుని మరీ చేశాను. ఆ సన్నివేశం షూట్‌ పూర్తి అయిన తర్వాత నా నటనకు సెట్‌ లో అంతా కూడా గట్టిగా క్లాప్స్‌ కొట్టి అభినందించారు. కానీ కొందరు మాత్రం దాన్ని కూడా ట్రోల్‌ చేశారు. 9 నిమిషాల ఆ సన్నివేశంలో 10 సెకన్ల షాట్ బాగాలేదు అంటూ కామెంట్స్ చేసిన వారు కొందరు ఉన్నారు. అయితే నేను ఆ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. నేను పాజిటివ్ మైండ్‌ తో నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు హిందీలో ఒక సినిమా మరియు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఈ అమ్మడు చేస్తుంది.ఎవరి కామెంట్స్ పటించుకోకుండా తన వర్క్ తాను చేసే ఈ అమ్మడు మంచి సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు .






Untitled Document
Advertisements