సార్వత్రిక ఎన్నికలకు ముంగిట దేశ రాజధాని ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆప్ పార్టీతో పొత్తును నిరసిస్తూ ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి రాజీనామా చేశారు. తన అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఆప్తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపిస్తూ పార్టీని వీడారు.
తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయ, నసీబ్ సింగ్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఆప్తో పొత్తుపై అసంతృప్తి వ్యక్తి చేసిన వీరు నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఉదిత్ రాజ్ నామినేషన్ను వ్యతిరేకించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తమ రాజీనామా లేఖ పంపారు. కాగా, అర్విందర్ సింగ్ లవ్లీ స్థానంలో పార్టీ పంజాబ్ ఇన్చార్జ్ దేవేందర్ యాదవ్ను ఢిల్లీ కాంగ్రెస్కు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.