ఆర్టికల్ 370 రద్దుతర్వాత పాక్ కవ్వింపు చర్యలు ఎక్కువ చేసింది. దానికి ధీటుగా ఇండియన్ ఆర్మీ సమాధానం చెప్తూ వస్తుంది. తాజాగా భారత సైన్యం పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. భారత సైన్యం దాడిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మకాం వేసిన యాభై మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తుంది.ఇండియన్ ఆర్మీ ఏడు ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులకు దిగింది.భారత సైన్యం కాల్పుల్లో 7 మంది పాకిస్థాన్ కమాండర్లు కూడా మృతిచెందినట్టు సమాచారం. దీంతో.. పీవోకేలో ఒకే రోజు 57 మందిని మట్టుబెట్టింది భారత సైన్యం. ఇక, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. మరోవైపు ఈ ఘటనతో షాక్ తిన్న పాకిస్థాన్ సర్కార్.. ఇస్లామాబాద్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.