శతకం సాధించిన కోహ్లీ...

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:08 PM

శతకం సాధించిన కోహ్లీ...

కోల్‌కతా, నవంబర్ 20 : ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్నటెస్ట్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో అలరించాడు. తనదైన శైలిలో ముచ్చటైన షాట్లతో అభిమానులను మురిపించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా విరాట్‌ కోహ్లీ (104 నాటౌట్‌). అంతే కాకుండా కోహ్లీకి ఈ సెంచరి టెస్టుల్లో 18వది కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ శతకం కావడం విశేషం. విరాట్ శతకం తర్వాత భారత్ తన రెండవ ఇన్నింగ్స్ ను 352/8 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండోఇన్నింగ్స్ ను ప్రారంభించిన ప్రత్యర్ధి జట్టు 69/6 తో పోరాడుతుంది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ మూడు, షమీ రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకొన్నారు.





Untitled Document
Advertisements