పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త

     Written by : smtv Desk | Wed, Sep 23, 2020, 03:19 PM

లాక్ డౌన్ కారణంగా నిర్మాణంలో వున్న సినిమాలు, నిర్మాణం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఇక గత ఐదారు నెలల నుంచీ షూటింగులు బంద్ కావడంతో నిర్మాణంలో వున్న చిత్రాలు ఇప్పుడు మెల్లగా షూటింగులు మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని చిత్రాలకు ఆర్టిస్టుల డేట్స్ సమస్య కూడా ఉత్పన్నమవుతోంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే చాలావరకు పూర్తయింది. ఇక మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రం మిగిలివుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.

అయితే, పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా అప్పుడే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements