నరుడు దైవిక శక్తి గల ఓ ఋషి. బ్రహ్మ శరీరం భాగం నుండి ధర్మదేవుడు జన్మించాడు. ఇతడు దక్షుని 10 మంది పుత్రికలను వివాహమాడగా వారికి చాలామంది సంతానం కలిగింది. అందులో ముఖ్యులు హరి, కృష్ణ, నర, నారాయణులు. వారిలో హరి, కృష్ణులు గొప్ప యోగులు కాగా నర నారాయణులు గొప్ప ఋషులయ్యారు. వీరు హిమాలయాలలోని బదరికాశ్రమంలో వేల సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తప్పసు చేశారు. వీరు ఊర్వశికి జన్మనిచ్చారు.