తక్కువ కాలంలోనే అదిరే రాబడి...రూ.లక్ష పెడితే రూ.7 లక్షలు

     Written by : smtv Desk | Sat, Sep 18, 2021, 10:38 AM

తక్కువ కాలంలోనే అదిరే రాబడి...రూ.లక్ష పెడితే రూ.7 లక్షలు

స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే అదిరిపోయే లాభం పొందొచ్చా? చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మార్కెట్‌లో డబ్బులు సంపాదించిన వారు ఉన్నారు. అలాగే పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అందువల్ల స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించొచ్చా? లేదా? అనేది చెప్పడానికి లేదు.

అయితే కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని అర్జించి పెట్టాయి. ఇలాంటి షేర్లలో ఏఎన్‌జీ లైఫ్‌సైన్సెస్ కూడా ఒకటి. ఈ ఫార్మా షేరు ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడిని అందించింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ షేరు ర్యాలీ చేసింది. ధర పరుగులు పెట్టింది.

గత ఆరు నెలల కాలంలో ఏఎన్‌జీ లైఫ్‌సైన్సెస్ షేరు ధర రూ.85 నుంచి రూ.642కు చేరింది. అంటే దాదాపు 650 శాతం ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇన్వెస్టర్ల పంట పండింది. భారీ లాభాన్ని అర్జించారు. తక్కువ కాలంలో కళ్లుచెదిరే లాభం పొందారు.

అంటే ఆరు నెలల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.7.5 లక్షలు అయ్యేది. ఆరు నెలలలోనే ఈ భారీ లాభం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ఈ షేరు కొనుగోలు చేయొచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే రూ.750 నుంచి రూ.800 స్టాప్‌లాస్ టార్గెట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements