తెరాస ప్రభుత్వాన్ని ప్రశంసించిన జగ్గారెడ్డి

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 12:37 PM

తెరాస ప్రభుత్వాన్ని ప్రశంసించిన జగ్గారెడ్డి

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే ..జగ్గారెడ్డి సరికొత్త వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి ఏకంగా అధికారా తెరాస ప్రభుత్వాన్ని పొగడడం విశేషం . అయితే సంగారెడ్డి నియోజక వర్గానికి మెడికల్ కాలేజిని తెలంగాణా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజి పనులను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. అంతేకాక త్వరలోనె నిర్మాణం పూర్తయితే తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించాలని ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావుని కోరినట్లు వెల్లడించారు. అంతేకాక తాను చాలా సార్లు అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రస్తావన తీసుకొచ్చానని తెలియజేస్తూ .. ఇప్పుడు అధికారంలో తమ పార్టీ ఉంటె అసెంబ్లీలో అన్ని సార్లు ప్రస్తావించే అవసరం ఉండకాపోయేది అని ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాక వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల అవసరాల దృష్ట్యా వారి ప్రతినిధిగా భాద్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఒకవైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే తమ గురించి కూడా ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు .





Untitled Document
Advertisements