ఆసియా క్రీడల్లో దూసుకెళ్ళిన విజయవాడ అమ్మాయి.. స్వర్ణ పతకం కైవసం

     Written by : smtv Desk | Wed, Oct 04, 2023, 11:25 AM

 ఆసియా క్రీడల్లో దూసుకెళ్ళిన విజయవాడ అమ్మాయి.. స్వర్ణ పతకం కైవసం

ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత్ ఆటగాళ్ళు ఆటల్లో రాణిస్తున్నారు. విజయపథంలో దుసుకేలుతున్నారు. ప్రతీ రోజూ పతకాల మోత మోగిపోతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఓజాస్ దియోత‌లేతో కలిసి బంగారు పతకం గెలిచింది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన ద‌క్షిణ‌ కొరియా ఆట‌గాళ్ల‌ను ఓడించారు. ఫైన‌ల్లో సురేఖ–ఓజాస్ 159-158 స్కోరుతో సో చ‌యివాన్‌– జూ జ‌హివూన్ పై ఉత్కంఠ విజయం సాధించారు. ఆసియా క్రీడ‌ల్లో భార‌త ప‌త‌కాల సంఖ్య 71కు చేరుకుంది. ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాల రికార్డును భారత్ అధిగమించింది. 2018లో జరిగిన గత ఎడిషన్‌లో భారత్ 70 పతకాలు సాధించింది.ఇప్పుడు ఆ మార్క్ ను దాటింది.





Untitled Document
Advertisements