ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ మేనియా నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు. వరల్డ్ కప్ నేపధ్యంలో క్రీడలను విశేషంగా ఆనంద్ మహీంద్రా కూడా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు. ఇవాళ్టి నుంచి నవంబరు 19 వరకు భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. ఐయాం రెడీ.. థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ పోస్టు పెట్టారు. ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. దానిపై ఆనంద్ 55 అని రాసి ఉంది. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది. మహీంద్రా గ్రూప్ నకు చెందిన ఐటీ విభాగం టెక్ మహీంద్రా బీసీసీఐకి డిజిటల్ పార్టనర్ గా కొనసాగుతోంది.
I’m READY….
mdash; anand mahindra (@anandmahindra) October 5, 2023
Thank you @bcci @tech_Mahindra (digital partners of BCCI ) @c_p_gurnani @mohitjoshi74 @manishups08 pic.twitter.com/ip73oTMDlj