సీఎం రేవంత్ రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.. కేటీఆర్

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 11:44 AM

సీఎం రేవంత్ రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.. కేటీఆర్

తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ ప్రీ మరియు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల నడుమ మాట యుద్ధం రోజురోజుకి పెరుగుతూనే ఉండి. తాజాగా మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తా అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయ‌డం ఎందుకు? త‌న భార్య, పిల్ల‌ల మీద ఒట్టు వేయ‌డం లేదని మండిప‌డ్డారు. ఎందుకంటే దేవుళ్లు అడ‌గ‌రని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తాడ‌న్నారు. క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయ‌న గురువారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.





Untitled Document
Advertisements