వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు కౌంటర్ వేసి అవినాష్ తల్లి..

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 12:57 PM

వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు కౌంటర్ వేసి అవినాష్ తల్లి..

ఏపీలో ఒకపక్క ఎన్నికల వేడి, మరోపక్క వైఎస్ వివేకా హత్య కేసు ఈ రెండు కలసి అక్కడి రాజకీయాలను హిటేక్కిస్తున్నాయి. వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి.. జగన్ ఒకవైపు అతని చెల్లెళ్ళు షర్మిల, సునీత ఒకవైపు అన్నట్టుగా సాగుతున్నాయి రాజకీయాలు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఆయన సతీమణి సౌభాగ్యమ్మ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిపై గురువారం జగన్‌‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి జగన్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని అందులో ప్రశ్నించారు. కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఒక రాష్ట్ర సీఎంగా నీ కర్తవ్యం ఇదేనా అని సౌభాగ్యమ్మ నిలదీశారు. ఇప్పటికైనా సునీత, షర్మిలల పోరాటం అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. తాజాగా, ఈ లేఖకు కడప లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మీ కౌంటర్ ఇచ్చారు.
వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన వారితో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ లక్ష్మీ మండిపడ్డారు. ‘జగన్ మనోవేదన ఆరోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మా? జగన్‌కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడి ఉంటారు? మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే కచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది.. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి!’ అని లక్ష్మీ తన లేఖలో వ్యాఖ్యానించారు.
https://twitter.com/YSRCParty/status/1783722815377809696?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1783722815377809696%7Ctwgr%5E03be03eb65fb31da53a71bceecd6fec46e11e029%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fkadapa-ysrcp-mp-avinash-reddy-mother-ys-lakshmi-counter-to-ys-vivekananda-reddy-wife-sowbhagyamma%2Farticleshow%2F109616612.cms





Untitled Document
Advertisements